తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉ.9.30 నుంచి మ.12.30 గంటల వరకు పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. ఫెయిలైన విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో మే 16వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు 15 రోజుల పాటు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్కు రూ.500, రీవెరిఫికేషన్కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.. SHARE IT>>