ప్రధానమంత్రిగా మళ్లీ మూడోసారి అధికారం చేపట్టబోతున్నారు నరేంద్ర మోదీ. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని అవుతున్నది మోదీ మాత్రమే. అందుకే ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి 9వేల మంది అతిథులు వస్తున్నారు. ఇండియాపై కుట్రలు చేస్తున్న పాకిస్థాన్, చైనాకి మాత్రం ఆహ్వానం పంపలేదు. ఈ రెండు దేశాలూ తరచుగా భారత్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఆహ్వానం పంపలేదు.