మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ లభించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అసాధారణంగా కనిపిస్తోందన్నారు. ‘తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించలేదు. ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది. మళ్లీ ఆయన జైలుకు వెళ్లాల్సిందే’ అని పేర్కొన్నారు.