లైవ్‌లో చూపిస్తూ 160 కి.మీ వేగంతో కారు డ్రైవ్‌.. నలుగురు మృతి

1554చూసినవారు
ఐదుగురు స్నేహితులు అహ్మదాబాద్‌ నుంచి ముంబైకి కారులో ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వందకు పైగా వేగంతో కారు వెళ్లడాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో చూపించారు. 160 kmph వేగంతో వరుసగా వాహనాలను డ్రైవర్‌ దాటి వెళ్లడంతో అతడ్ని ఎంకరేజ్‌ చేశారు. ఈ క్రమంలో ఆ కారు అదుపతప్పి ఒక చెట్టును బలంగా ఢీకొట్టడంతో అందులోని నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో డ్రైవ్‌ చేసిన వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. గుజరాత్‌లోని వాసద్‌ జిల్లాలో మే 2న ఈ ఘటన జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్