హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉందని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ పేర్కొన్నారు. బుధవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటేసిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్స్కు టికెట్ ఇవ్వడం ఆ పార్టీకి తీరని నష్టం చేకూర్చుతుందన్నారు. 62 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్కు 34, బీజేపీకి 25 మంది సభ్యుల బలం ఉందన్నారు. రెబెల్స్ ఆరుగురు గెలిచినా తమకు నష్టం లేదన్నారు.