’‘యానిమల్’ చిత్రానికి రణ్వీర్ సింగ్ ఇచ్చిన రివ్యూను నేను మర్చిపోలేను. దాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఈ మూవీ చూశాక నాకు ఫోన్ చేసి 40 నిమిషాలు మాట్లాడారు. ఆ తర్వాత ఓ సుదీర్ఘ మెసేజ్ పెట్టారు. దాన్ని నాలుగు సార్లు చదువుకున్నా. చాలా ఆనందం వేసింది. సినిమా గురించి చాలా విషయాలు రాశాడు. ఇందులో ఇన్ని విశేషాలున్నాయా అని నేనే ఆశ్చర్యపోయాను’ అని సందీప్ వంగా చెప్పారు. ‘యానిమల్’కు త్వరలోనే సీక్వెల్ రానుందని తెలిపారు.