గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండడంతో దాదాపు 300 మందికిపైగా పౌరులు మరణించారు. నెల రోజుల క్రితం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఇజ్రాయెల్ మళ్లీ దాడికి దిగింది. అరగంటలో 35 వైమానిక దాడులు చేయడంతో 300 మందికి పైగా మరణించినట్లు సమాచారం.