మే 20న దేశవ్యాప్తంగా కార్మిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. లేబర్ కోడ్ రద్దు, ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ పలు కార్మిక సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. కనీస జీతం రూ.26,000కు పెంచాలని, EPS కింద రూ. 9000 పెన్షన్ ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో సంప్రదింపులు జరపాలని కోరుతున్నాయి.