మాజీ ఐపీఎస్ ప్రొబెషనరీ అధికారి పూజా ఖేద్కర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం సాధించినట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా కేసు విచారణ జరిగే వరకు అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది. అలాగే పిటిషన్ విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది.