కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్తో రహానే ఈ ఫీట్ సాధించాడు. గత సీజన్లో కేకేఆర్ను నడిపించిన శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్కు వెళ్లిపోయాడు.