విప్లవ స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల త్యాగాలను స్మరించుకుందామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 23, 1931న లాహోర్ జైలులో వారిని ఉరితీసింది. ఈ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు మన దేశం వారి అత్యున్నత త్యాగాలను స్మరించుకుంటుంది. స్వేచ్ఛ, న్యాయం కోసం వారు నిర్భయంగా చేసిన కృషి మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంది’ మోడీ అన్నారు.