భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 32 పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమా/ఐటీఐ పాసైన అభ్యర్థులు అర్హులు. SC/ST/PwBD/ మాజీ సైనికులు మినహా జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. 09 ఏప్రిల్, 2025తో దరఖాస్తులు చేయడానికి గడువు ముగియనున్నది. పూర్తి వివరాలకు www.bel-india.in వెబ్సైట్ను చూడొచ్చు.