ALERT: నిప్పుల కొలిమిలా ఉమ్మడి వరంగల్ జిల్లా

36746చూసినవారు
ALERT: నిప్పుల కొలిమిలా ఉమ్మడి వరంగల్ జిల్లా
భానుడి ఉగ్రరూపం దాటికి తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడు రోజుల్లో వడదెబ్బకు ఐదుగురు మృతి చెందారు. ములుగు జిల్లాలో 45.4 డిగ్రీలు, జనగామ జిల్లాలో 45.3° ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 23 మండలాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. హన్మకొండ జిల్లాలోని గూడూరులో పత్తిపాక రమేష్(41), భీమారానికి చెందిన నవీన్ (29), ఏటురునాగారంలో ప్రేమలీల (66), నాగులు (80) వడదెబ్బకు మృతి చెందారు.

సంబంధిత పోస్ట్