తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సర్వం సిద్దమని CS శాంతి కుమారి వెల్లడించారు. గ్రూప్-1 మెయిన్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో గురువారం CS వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఏ విధమైన పొరపాట్లు జరగొద్దని, పకడ్బందీగా నిర్వహించాలన్నారు. HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు జరుగనున్నాయి.