అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట చేయడంతో కోట్లాది మంది హిందువు
ల కల సాకారమైంది. ఈ వేడుకలు ప్రధాని
మోదీ చేతులమీదుగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రాముడి దర్శనానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘రామచంద్రకీ జై’ అంటూ గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకుంటున్న ఫొటో, ఆలయం చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు.