కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని చిక్కాటి గ్రామానికి చెందిన 81 ఏళ్ల చిన్నమ్మ.. ఓటు హక్కు వినియోగంలో తన నిబద్ధతను చాటుకుంటున్నారు. ఇప్పటివరకు 41 సార్లు ఆమె ఓటేశారు. గ్రామ, జిల్లా పంచాయతీ, విధానసభ, లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా ఆమె ఓట్లు వేస్తున్నారు. ‘ఓటు వేయడం మన హక్కు. దేశ భవిష్యత్తు కోసం తగిని వ్యక్తిని ఎన్నుకోవడం మన బాధ్యత’ అని ఆమె తెలిపారు.