ఏపీలోని విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గన్తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. ఉదయం 5 గంటలకు విధులకు కానిస్టేబుల్ శంకర్ రావు హాజరయ్యారు. అనంతరం ఎస్ఎల్ఆర్తో కాల్చుకుని శంకర్ రావు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా స్థానిక ఐవోబీ బ్యాంక్ లో ఈయన గన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.