ఇక నిత్యం క్షేత్రస్థాయిలోనే: KCR

67చూసినవారు
ఇక నిత్యం క్షేత్రస్థాయిలోనే: KCR
తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఇకపై నేతలు, పార్టీ యంత్రాంగం నిత్యం క్షేత్రస్థాయిలోనే ఉండేలా కార్యాచరణ ఉంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. రైతాంగంతో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా పార్టీ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యవర్గాల ఏర్పాటు లాంటివి చేపట్టే అవకాశమున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్