నేపాల్లో మరోసారి భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.0గా నమోదైనట్లు భూకంప కేంద్ర అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. ఇక భారతదేశంలోని ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు భారత విపత్తు నిర్వహణ అథారిటీ విభాగం వెల్లడించింది.