రామాయణం ఆధారంగా టాలీవుడ్లో మరో భారీ చిత్రం రూప
ుదిద్దుకోనుంది. అంతర్జాతీయ స్థాయి ప్ర
మాణాలతో, చిత్రాలయం బేనర్పై భారీస్థాయిలో నిర్మించేందుకు నిర్మాత వేణు దోనెపూడి సన్నాహాలు మొదలుపెట్టారు. శ్రీర
ామనవమి సందర్భంగా బుధవారం ఆయన ఈ చిత్రాన్ని ప్రకటించారు. దర్శకుడు వి.ఎన్ ఆదిత్య కథను అందిస్తున్నారు. ‘జర్నీ టూ అయోధ్య’ అనేది వర్కింగ్ టైటిల్. తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.