సీఎంకు మరోసారి షాక్

65చూసినవారు
సీఎంకు మరోసారి షాక్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి మరోసారి నిరాశ ఎదురైంది. మధ్యంతర బెయిల్ కోసం కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ అభ్యర్థన చేసుకున్నారు. దానిపై ఇప్పటికే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు ఈరోజుకు వాయిదా వేసింది. ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ జూన్‌ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.

సంబంధిత పోస్ట్