ఏపీకి మరో వందే భారత్ రైలు

2097చూసినవారు
ఏపీకి మరో వందే భారత్ రైలు
ఏపీకి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలును విజయవాడ- చెన్నై రూట్లో నడపనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 7న ప్రధాని దేశవ్యాప్తంగా 5 వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభిస్తారు. అందులో విజయవాడ- చెన్నై రైలు కూడా ఒకటి. ఈ వందేభారత్ రైలు విజయవాడ నుండి గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదుగా చెన్నై వెళ్లి, అదే మార్గంలో తిరిగి వస్తుందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్