స్కానింగ్కు వచ్చే మహిళలు, యువతుల న్యూడ్ ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో జరిగింది. స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ ఈ వికృత చేష్టలకు పాల్పడటంతో సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సీరియస్ అయ్యారు. వివరణ ఇవ్వాలని జిల్లా వైద్య అధికారికి ఆదేశాలు జారీ చేశారు.