అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుప్పుతూరి నుంచి అచ్యుతాపురం వెళ్తుండగా బైక్ను లారీ ఢికొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు అచ్యుతాపురం-ఎలమంచిలి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.