నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి గ్రామీణ మండలం గౌరవరం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకవైపు నుంచి కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.