జూన్ 24న పీచు మిఠాయి, గోబీ మంచూరియా, చికెన్ కబాబ్లు, చేపల వంటకాల్లో కృత్రిమ రంగులను రాష్ట్రవ్యాప్తంగా నిషేధిస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కృత్రిమ రంగులు ఆహార నాణ్యతను దెబ్బతీస్తున్నాయని నాణ్యత తనిఖీల్లో వెల్లడైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. చాలా వరకూ శాంపిళ్లలో సన్సెట్ యెల్లో, బ్రిలియంట్ బ్లూ, కార్మోసిన్ రంగులు ఉన్నట్టు తేలిందని సంబంధిత అధికారులు తెలిపారు.