జీతాలు పెంచాలని ఆశావర్కర్ల నిరసన (వీడియో)

62చూసినవారు
హైదరాబాద్ లోని కోఠి DME కార్యాలయం ముట్టడికి ఇవాళ ఆశా వర్కర్లు యత్నించారు. తమకు జీతాలు రూ. 18వేలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందని.. దానిని వెంటనేఅమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా 1వ తారీఖున ఆశా వర్కర్ల జీతాలు చెల్లించాలని.. నూతన నియామకాలు చేపట్టాలని కోరారు. ఆశా వర్కర్లు భారీగా చేరుకోవడంతో DME ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు.

సంబంధిత పోస్ట్