చెపాక్‌లో అశ్విన్ సెంచ‌రీ.. బామ్మ చేసిన ప‌నికి అంతా షాక్‌ (వీడియో)

85చూసినవారు
చెన్నై వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ సెంచ‌రీ చేసిన త‌రువాత అత‌డు అభివాదం చేసిన స‌మ‌యంలో మైదానంలోని ప్రేక్ష‌కులు స్టాండింగ్ ఓవెష‌న్‌లో అభినంద‌న‌లు తెలియ‌జేశారు. కాగా.. ఓ బామ్మ త‌న చేతుల్లో రెండు కాఫీ క‌ప్పుల‌ను ప‌ట్టుకుని ఉన్నా కూడా చ‌ప్ప‌ట్ల‌తో అశ్విన్‌ను అభినందించింది. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్