అమెరికా-భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇంకా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. ఆమె భూమి మీదికి రావడానికి మరింత సమయం పడుతుందని సమాచారం. ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్.. స్పేస్ స్టేషన్లోనే చిక్కుకున్నారు. అంతరిక్ష కేంద్రానికి వెళ్లి జూన్ మధ్యలోనే తిరిగి రావాల్సిన ఇద్దరు వ్యోమగాలు.. బోయింగ్ వ్యోమనౌకలో థ్రస్టర్ ఫెయిల్యూర్ కావడంతో వారిని నాసా అక్కడే ఉంచేసింది.