హైదరాబాద్ లోని బేగంబజార్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భర్త, అత్తపై కోడలు దాడి చేయించింది. ఈదాడిలో భర్త రామేశ్వర్, అతడి తల్లి గంగాభాయి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న బేగంబజార్ పోలీసులు.. కోడలు, ఆమె సోదరులపై కేసు నమోదు చేశారు.