పంజాబ్లోని లూథియానాలో భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. సివిల్ హాస్పిటల్ సమీపంలో శుక్రవారం శివసేన నేత సందీప్ థాపర్ పై నిహాంగ్ సిక్కుల వేషధారణలో ఉన్న నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. సందీప్ థాపర్ స్థానిక కార్యక్రమంలో ప్రసంగించి వస్తుండగా దుండగులు బైక్ ను అడ్డగించారు. గన్ మ్యాన్ వద్ద ఉన్న రివాల్వర్ లాక్కున్నారు. అనంతరం విచాక్షణారహితంగా కత్తులతో నరికారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా, పోలీసులు విచారణ చేపట్టారు.