ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మేరకు మెట్రో రైలులోని లేడీస్ కోచ్లో ఎక్కువ మంది పురుషులు ప్రయాణించారు. దీంతో అసౌకర్యానికి గురైన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మెట్రో రైలు ఒక స్టేషన్కు చేరుకోగానే పోలీసులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. లేడీస్ కోచ్లో ప్రయాణించిన మగవారిని చెంప దెబ్బలతో స్వాగతించారు. లోపల ఉన్న వారికి కూడా దేహశుద్ది చేశారు. ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరలయింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు.