పశ్చిమబెంగాల్లోని భూపతి నగర్లో జరిగిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. 2022 టపాసులు కాల్చిన ఘటనలో ఉదయాన్నే ఎన్ఐఏ అధికారులు వెళ్లారని ఓ ఎన్నికల ర్యాలీలో మమత పేర్కొన్నారు. తొలుత దాడి చేసింది మహిళలు కాదని.. ఎన్ఐఏ అధికారులేనని అన్నారు. అందుకే చేసేది లేక తిరిగి దాడికి పాల్పడ్డారన్నారు. ఎన్ఐఏ, సీబీఐ భాజపాకు సోదరులైతే.. ఈడీ, ఐటీ ఆ పార్టీకి ఫండింగ్ బాక్సులంటూ విమర్శించారు.