బిహార్ రాష్ట్రంలోని ప్రొహిబిషన్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, నిఘా విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం పోటీ పరీక్ష ఆదివారం జరిగింది. ఈ పరీక్ష కోసం పాట్నా కాలేజీ సెంటర్కు ఒక వ్యక్తి హాజరయ్యాడు. అక్కడ ముందుగా దాచిన మొబైల్ ఫోన్లో ప్రశ్నాపత్రం ఫొటో తీశాడు. దానిని ఇతరులకు పంపేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. పోలీస్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్వామి వివేకానంద్ కుమార్ యాదవ్గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు.