నా గుండు మీద ఉన్న శ్రద్ధ 6 గ్యారంటీలపై లేదు: బండి సంజయ్

53చూసినవారు
నా గుండు మీద ఉన్న శ్రద్ధ 6 గ్యారంటీలపై లేదు: బండి సంజయ్
6 గ్యారంటీల విషయంలో ప్రజలను సీఎం రేవంత్‌ రెడ్డి మోసం చేశారని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఆరోపించారు. హుజురాబాద్‌లో బీజేపీ స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ లో బండి మాట్లాడుతూ.. రూ. 12 వేల కోట్లు తెచ్చి కరీంనగర్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలకు నా గుండు మీద ఉన్నంత శ్రద్ధ 6 గ్యారంటీలపై లేదన్నారు.

సంబంధిత పోస్ట్