ముంబై విమానాశ్రయంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. టాయిలెట్లో ఉన్న చెత్తబుట్టలో శిశువు మృతదేహాన్ని ఎయిర్పోర్ట్ సిబ్బంది గుర్తించింది. సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.