ఐపీఎల్-2025 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్లో కేకేఆర్, ఆర్సీబీ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందట. శనివారం కోల్కత్తాలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది అనుమానంగా ఉంది.