తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. జూన్ 1 నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం అవనుండగా.. తాజాగా షెడ్యూల్ ను మార్చింది. రోజూ ఉ.7 నుంచి ఉ.11 వరకు స్కూల్ టీచర్లు తమ పరిధిలోని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చదువుకు దూరంగా ఉంటున్న పిల్లల్ని టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకోనున్నారు.