కాశ్మీరీ జర్నలిస్టు అసిఫ్ సుల్తాన్కు ఐదేళ్ల కిందటి ఉపా కేసులో శ్రీనగర్లోని ఒక కోర్టు బెయిల్ మంజారు చేసింది. జమ్ముకాశ్మీర్ ప్రజా భద్రత చట్టం కేసులో ఐదేళ్ల పాటు జైలు ఉండి ఈ ఏడాది ఫిబ్రవరి 29న విడుదలైన రెండు రోజుల్లోనే మళ్లీ ఉపా కేసులో అసిఫ్ సుల్తాన్ను పోలీసులు అరెస్టుచేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2019లో శ్రీనగర్ సెంట్రల్ జైలులో జరిగిన అల్లర్లకు సంబంధించిన ఈ ఉపా కేసులో బుధవారం శ్రీనగర్లోని ప్రత్యేక కోర్టు అసిఫ్కు బెయిల్ మంజారుచేసింది.