ఐపీఎల్లోని కొన్ని రూల్స్పై బీసీసీఐ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. సలైవాపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేసింది. ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చునని తెలిపింది. బంతిని రివర్స్ స్వింగ్ చేసే క్రమంలో పేసర్లు ఉమ్మిని బంతికి రాస్తుంటారు. కరోనా సమయం నుంచి దీనిపై ఐపీఎల్తోపాటు అంతర్జాతీయ క్రికెట్లో నిషేధం విధించారు. అలాగే సెంకడ్ ఇన్నింగ్స్లో రెండు బంతులు వాడుకోవచ్చునని తెలిపింది.