తమిళ ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా (48) గుండెపోటుతో కన్నుమూశారు. మనోజ్ భారతీరాజాకు నెల రోజుల క్రితం సిమ్స్ ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. అయితే రెండు మూడు రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన కన్నుమూశారు.