ఎన్నికల వేళ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్లో 200 మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. తాజాగా వారంతా కాషాయ కండువా కప్పుకున్నారు. దీనిపై బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్కు మూలస్థంభాలు, అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వారు పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే పడవలా కనిపిస్తోందని, ఆ పార్టీ విభజన కుల రాజకీయాలపై మాత్రమే దృష్టి సారిస్తుందని వ్యాఖ్యానించారు.