తొలి ఇన్నింగ్స్ను జోరుగా ప్రారంభించిన టీమిండియా బిగ్ షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కేశవ్ మహరాజ్ వేసిన రెండో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన రోహిత్(9).. నాలుగో బంతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్ రెండో ఓవర్ చివరి బంతికి ఖాతా తెరవకుండానే కీపర్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ రెండో ఓవర్లకు 23/2.