తెలంగాణలోని పేదలకు ఉచిత వైద్యం అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ వెల్లడించారు. వరంగల్ లో అధికారుల సమావేశంలో మాట
్లాడుతూ.. 'రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఒక హెల్త్
కార్డు ఇచ్చి.. హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తాం. బ్లడ్ గ్రూప్ నుంచి చిన్న, పెద్ద ఆరోగ్య సమస్యలను అందులో పొందుపరుస్తాం. దీంతో ఏ ఆస్పత్రికి వెళ్లినా..
గతంలో ఎలాంటి వైద్యం అందించారు. ఇ
ప్పుడు ఏం చేయాలనేది తెలుస్తుంది' అని ప్రకటించారు.