లోక్సభ ఎన్నికల వేళ చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోకజన శక్తి పార్టీ (LJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్లో LJP పార్టీకి 22 మంది సీనియర్ నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. లోక్సభ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వారంతా పార్టీకి రాజీనామా చేశారు. తామంతా
ఇండియా కూటమికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు.