పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర హైకోర్టు బిగ్ షాకిచ్చింది. దీదీ ప్రభుత్వం 2010 తర్వాత జారీ చేసిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయంపై మమతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సామాజిక వర్గాలను ఓబీసీ జాబితా నుంచి తొలగించేలా వారు (బీజేపీ) ఈ ఆర్డర్ ఇచ్చారని ఆరోపించారు. ఓబీసీ రిజర్వేషన్ కొనసాగుతుందన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ తీర్పును స్వాగతించారు.