ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.7 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 24 కేసుల్లో 11.40 కిలోల బంగారం పట్టుబడింది. వీటితోపాటు పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.