టీ20 ప్రపంచకప్ 2024లో శ్రీలంక లీగ్ దశలోనే నిష్క్రమించనుంది. గ్రూప్ డిలో ఉన్న శ్రీలంక.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్తో జరిగిన మొదటి రెండు మ్యాచ్ల్లో ఓడింది. నేడు నేపాల్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయింది. దీంతో గ్రూప్ డిలో మూడు విజయాలు సాధించి 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూప్ బిలో సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.