పంజాబ్లోని మొత్తం 13 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖర్ మంగళవారం తెలిపారు. అమృత్సర్లో మీడియాతో మాట్లాడారు. శిరోమణి అకాలీదళ్(SAD)తో పొత్తు ఉండదన్నారు. మరో వైపు దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, AAP కూడా రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 6, బీజేపీ 3, SAD 2, AAP 1, SAD (అమృత్సర్) 1 చొప్పున గెలిచాయి.