పాట్నాలో దోపిడీని అడ్డుకున్నందుకు బీజేపీ నేత దారుణ హత్య

55చూసినవారు
పాట్నాలో దోపిడీని అడ్డుకున్నందుకు బీజేపీ నేత దారుణ హత్య
బీహార్‌లోని పాట్నాలో బీజేపీ నేత శ్యామ్ సుందర్ శర్మ అలియాస్ మున్నా శర్మ చౌక్ మండల బీజేపీ మాజీ అధ్యక్షునిగా పనిచేశారు. సోమవారం ఉదయం ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు. అతని మెడలోని బంగారు గొలుసును అటుగా వచ్చిన దుండగులు లాక్కుపోయే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో శ్యామ్‌ సుందర్‌ వారిని అడ్డుకున్నారు. దీంతో దుండగులు తుపాకీలో శ్యామ్‌ సుందర్‌ తలపై కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్